Iran USA War: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ట్రంప్ అన్నంతపని చేశాడుగా! | | ACTPnews

ట్రంప్ (File Image - Reuters)


Last Updated:

జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన దాడికి ప్రతీకారంగా అగ్రరాజ్యం ఇరాన్‌పై భీకర దాడులు చేపట్టింది. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వెంటనే యూఎస్ బలగాలు దాడులకు దిగడం మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

News18
News18

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరంపై ఇరాన్ సాయుధ దళాలు చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడులకు అమెరికా దీటుగా బదులిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే యూఎస్ దళాలు ఇరాన్‌లోని కీలక స్థావరాలపై భీకర వైమానిక దాడులు ప్రారంభించాయి. జోర్డాన్ భూభాగంలోకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్.. యూఎస్ స్థావరాలపై ఇరాన్ చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.

కేవలం క్షణాల వ్యవధిలో అమెరికా దళాలు స్పందించి ఆత్మరక్షణ చర్యలు చేపట్టాయని, ఇరాన్‌కు కచ్చితంగా గట్టి బుద్ధి చెబుతామని ఆయన స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య తలెత్తిన తాజా యుద్ధ వాతావరణం ప్రపంచ శాంతికి పెను ముప్పుగా మారింది. అదే సమయంలో ఈ ఉద్రిక్త పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ముడి చమురు ధరలపై పెను ప్రభావం చూపుతున్నాయి.

జోర్డాన్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై తామే దాడి చేశామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) అధికారికంగా ప్రకటించింది. అమెరికా దళాలు ఆసియా ప్రాంతంలో చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజలకు మద్దతుగానే ఈ బాలిస్టిక్ క్షిపణి దాడులు చేశామని ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. జోర్డాన్ గగనతలంలోకి దూసుకొచ్చిన నాలుగు క్షిపణులను జోర్డాన్ సైన్యం మధ్యలోనే కూల్చివేసింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన క్షిపణులను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని జోర్డాన్ సైనిక అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు.

గల్ఫ్ ప్రాంతంలోని కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ గతంలోనే బెదిరింపులకు పాల్పడింది. దీనిపై స్పందించిన ట్రంప్.. ఆ జలసంధిని ఏమైనా సరే తెరిచే ఉంచుతామని తేల్చిచెప్పారు. అమెరికా దళాలు ఆ జలసంధికి కాపలాదారులుగా వ్యవహరిస్తాయని, అందుకు రక్షణ ఫీజుగా 20 శాతం వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. వరుసగా మూడో రోజు కూడా ఇరాన్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఈ భీకర ఘర్షణలతో ఇరాన్‌లోని పలు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా వాణిజ్య నౌకలపై తమ దాడులు మరింత పెంచడంతో ఎర్ర సముద్రంలో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports