Last Updated:
కేవలం 10 అడుగుల దూరం నుంచి వెంకన్న దర్శనం.. ఈ అద్భుత అవకాశం మీకూ దక్కొచ్చు.. ఎలాగంటే!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని అతి దగ్గరగా దర్శించుకునే మహాద్భాగ్యం సుప్రభాత సేవ. స్వామివారిని మేల్కొల్పే ఈ పరమ పవిత్రమైన సేవలో పాల్గొనాలని, ఆ దివ్య మంగళ రూపాన్ని ప్రశాంతంగా చూడాలని ప్రతి భక్తుడూ పరితపిస్తుంటాడు. ఈ సేవకు ఉన్న భారీ డిమాండ్ కారణంగా ఒక్కో టికెట్ కోసం ఏకంగా వంద మంది వరకు భక్తులు పోటీ పడుతున్నారు. నవంబర్ నెలకు సంబంధించిన సుప్రభాత సేవా టికెట్ల ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. భక్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. https://ttdevasthanams.ap.gov.in/home/dashboard అధికారిక పోర్టల్ ద్వారా మీరు కూడా బుకింగ్ చేసుకోవచ్చు.














