Last Updated:
భారత్లో అధికారిక పర్యటనలో ఉన్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో ఎలాంటి కొత్త అడుగులు పడనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
భారత్–జపాన్ మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్లో అధికారిక పర్యటనలో ఉన్న కొయిజుమి ప్రధానితో సమావేశమై ద్వైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.














