Last Updated:
IND vs SL 2nd Test: కొలంబో వేదికగా ఆదివారం శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ ద్వారా భారత క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది.
మైదానంలో అడుగుపెట్టక ముందే టీమిండియా ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చేతుల మీదుగా సారాంశ్ జైన్ తన టెస్ట్ క్యాప్ను అందుకున్నాడు. 33 ఏళ్ల 145 రోజుల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సారాంశ్ జైన్, 21వ శతాబ్దంలో భారత్ తరఫున అత్యధిక వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 1998లో 35 ఏళ్ల 23 రోజుల వయసులో తన తొలి టెస్ట్ ఆడిన రాబిన్ సింగ్ తర్వాత, అత్యధిక వయసులో భారత్కు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా కూడా సారాంశ్ నిలిచాడు.














