Last Updated:
Dhruv Jurel: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో చెలరేగాడు.
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న జురెల్, తన సెంచరీ సంబరాలను ఎంతో వినూత్నంగా, భావోద్వేగభరితంగా జరుపుకున్నాడు. సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే తన బైసెప్స్పై ఉన్న ‘జై జవాన్, జై కిసాన్’ టాటూను చూపిస్తూ సైనిక రీతిలో సెల్యూట్ చేసి తన కుటుంబ మూలాలకు గౌరవం అందించాడు. ఈ సంబరాలు తన తండ్రి, తాతలకు అంకితమని మ్యాచ్ అనంతరం జురెల్ స్పష్టం చేశాడు.














