Last Updated:
AP Cabinet Meeting: ఈ సమావేశంలో ప్రధానంగా వెనుకబడిన తరగతులకు (బీసీలకు) స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నేడు (ఆగస్టు 18) అత్యంత కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో, సభా కార్యక్రమాల మధ్యలో లభించే విరామ సమయంలో.. అంటే.. టీ బ్రేక్ లేదా లంచ్ బ్రేక్ సమయంలో.. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లోనే ఈ కేబినెట్ భేటీ జరగనుండటం విశేషం. ఈ సమావేశంలో ప్రధానంగా వెనుకబడిన తరగతులకు (బీసీలకు) స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది.














