Last Updated:
BJP election strategy: మోదీ నిరంతర పాలనా దక్షతను, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న తీరును నవతరానికి వివరించేందుకు బీజేపీ ఒక పటిష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేసింది.
ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర కార్యాలయంలో 2029 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ జాతీయ స్థాయి బృందం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావడంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ‘మోదీ ఎట్ 25’ (Modi at 25 Plan) అనే ఒక బృహత్తర వ్యూహాన్ని చర్చించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ, 2026 నాటికి ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల సుదీర్ఘ, నిరంతర, అత్యంత విజయవంతమైన పాలనను పూర్తి చేసుకుంటున్నారు. ఈ పాతికేళ్ల కఠోర శ్రమ, అంకితభావం, అభివృద్ధి ప్రస్థానాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశ్యం. ఇండియా టుడే కథనం ప్రకారం, మోదీ నిరంతర పాలనా దక్షతను, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న తీరును నవతరానికి వివరించేందుకు బీజేపీ ఒక పటిష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేసింది.














