Last Updated:
టీటీడీ తిరుమలలో గోబీ వంటకాలను తాత్కాలికంగా నిషేధించింది. కాలీఫ్లవర్లో పురుగులు కనిపించడంతో భక్తుల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులు అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లలో ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసేముందు ఇక కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో కాలీఫ్లవర్తో తయారు చేసే గోబీ వంటకాలను తాత్కాలికంగా నిషేధించింది. ఇటీవల కాలీఫ్లవర్లో పురుగులు కనిపించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.














