Last Updated:
ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సుకు ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించారు. రక్షణ, వాణిజ్య సహకారంతో పాటు 2030 నాటికి వంద బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యమే అజెండాగా ఈ భేటీ సాగుతోంది.
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపం వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు ప్రారంభానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశం కోసం రష్యా అధ్యక్షుడు ఉదయమే భారత్ మండపానికి చేరుకోగా ప్రధాని మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. వాణిజ్యం, రక్షణ, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.














