Last Updated:
ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఏడేళ్ల తర్వాత జిన్పింగ్ భారత్కు రాగా.. సరిహద్దు వివాదాలు, వాణిజ్య లోటుపై నేతలు ప్రధానంగా చర్చించారు.
భారత రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శనివారం సుదీర్ఘంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సదస్సుకు హాజరైన చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఆత్మీయంగా కరచాలనం చేసి ఘన స్వాగతం పలికారు. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జిన్పింగ్ భారత్లో పర్యటిస్తుండటంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా బ్రిక్స్ సదస్సును విజయవంతం చేయడంలో చైనా అందించిన సహకారానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.














