C.P. Radhakrishnan : తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి.. | ACTPnews

C.P. Radhakrishnan : తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి..



భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ అర్చకులు, అధికారులు ‘ఇస్తికపాల్’ గౌరవంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆయన తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకుని, అనంతరం గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ఎం. రవిచంద్ర ఉపరాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి, శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం మరియు టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports