త్వరలో జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, అలాగే రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రివర్గంలో భారీ పునర్వ్యవస్థీకరణ జరగనుందని జాతీయ రాజకీయాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన మార్పు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ది వీక్, టీవీ9 మరాఠీ వార్తా సంస్థల కథనాల ప్రకారం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పెద్ద ప్రమోషన్ కల్పిస్తూ ఆయనను భారత ఉప ప్రధానిగా నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. NDA భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ పాలనలో మరింత పట్టు సాధించేందుకు మోదీ సర్కార్ ఈ సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు ఆయా పత్రికల విశ్వసనీయ వర్గాల సమాచారం స్పష్టం చేస్తోంది.













