Last Updated:
స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా 2027 జనాభా లెక్కల్లో కులగణన జరగనుంది. కేంద్ర ప్రభుత్వం రెండో దశ జనగణన కోసం 40 ప్రశ్నలతో కూడిన జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో కులంతో పాటు ఆధార్, బ్యాంక్ వివరాలు అడగనున్నారు.
భారతదేశ తదుపరి జనాభా లెక్కలు కేవలం పేరు, వయసు తెలుసుకోవడానికే పరిమితం కావు. 2027లో జరగబోయే జనగణనలో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సాధారణ కులాల లెక్కింపు కూడా జరగనుంది. 2026 ఆగస్టు 14న కేంద్ర ప్రభుత్వం రెండో దశ జనాభా లెక్కింపు (పాపులేషన్ ఎన్యుమరేషన్) కోసం 40 ప్రశ్నలతో కూడిన పూర్తి జాబితాను అధికారికంగా నోటిఫై చేసింది. న్యూస్18 హిందీ కథనం ప్రకారం.. ఈసారి కులంతో పాటు మతం, మాతృభాష, విద్య, ఉపాధి, వలసలు, కుటుంబ వివరాలకు సంబంధించిన ప్రశ్నలు అడగనున్నారు. ముఖ్యంగా ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి కీలక సమాచారాన్ని కూడా ప్రజల నుంచి సేకరించనున్నారు.














