ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరణ కావాలని ఆకాంక్షించారు. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తండ్రులు మరియు కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సంతానాన్ని ఒక సమస్యగా లేదా భారంగా చూడకుండా సంపదగా భావించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
Source link
Chandrababu Launches Pulse Polio Drive : ఉమ్మడి కుటుంబాలే సమాజానికి బలం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










