Last Updated:
దక్షిణామెరికా దేశమైన కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భయంకరమైన భూకంపం భారీ వినాశనాన్ని మిగిల్చింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 213 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద 3,000 మందికి పైగా గల్లంతయ్యారు.
దక్షిణామెరికా దేశం కొలంబియాలో సంభవించిన భయంకరమైన భూకంపం భారీ వినాశనాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 213 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు న్యూస్18 కథనం పేర్కొంది. శిథిలాల కింద చిక్కుకుని 3,000 మందికి పైగా గల్లంతయ్యారు. పశ్చిమ కొలంబియా ప్రాంతంలో భూమికి 96 కిలోమీటర్ల లోతున, సం జోస్ డెల్ పాల్మర్ సమీపంలో ఉదయం 7:34 గంటలకు ఈ భూకంప కేంద్రం నమోదైంది. కాఫీ సాగు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.














