Last Updated:
మైసూరు దసరాలో ఏనుగులకు బీమా రద్దు. ప్రభుత్వ ఏనుగులకు ప్రభుత్వమే పరిహారం కోరడం సరికాదని నిర్ణయం. సిబ్బంది, ప్రజల భద్రతకు బీమా పది రెట్లు పెరిగింది.
మైసూరు దసరా అంటే అంబారీని మోసే గజరాజులు, జంబూ సవారి, లక్షలాది మంది భక్తుల సందడి గుర్తుకొస్తాయి. అయితే 2026 దసరాలో తొలిసారి ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా దసరా ఏనుగులకు కల్పిస్తున్న బీమాను ఈసారి కర్ణాటక అటవీ శాఖ పూర్తిగా నిలిపివేసింది. ఆశ్చర్యకరంగా, ఏనుగులకు బీమా లేకపోయినా మొత్తం బీమా రక్షణ విలువ మాత్రం రూ.8.80 కోట్లకు పెరిగింది.














