Hyderabad News: నేపాల్ నుంచి హైదరాబాద్‌కి.. గుట్టుచప్పుడు కాకుండా ఏం జరుగుతోందో తెలుసా? ఈ నిజాలు తెలిస్తే.. | తెలంగాణ వార్తలు | ACTPnews

నేపాల్ నుంచి హైదరాబాద్‌కి.. గుట్టుచప్పుడు కాకుండా ఏం జరుగుతోందో తెలుసా? ఈ నిజాలు తెలిస్తే..


Last Updated:

నెల రోజుల్లో ఏకంగా 1,400 మంది.. పోలీసుల ‘ఆపరేషన్ ముస్కాన్’ వెనుక అసలు కథ ఇదే!

నేపాల్ నుంచి హైదరాబాద్‌కి.. గుట్టుచప్పుడు కాకుండా ఏం జరుగుతోందో తెలుసా? ఈ నిజాలు తెలిస్తే..
నేపాల్ నుంచి హైదరాబాద్‌కి.. గుట్టుచప్పుడు కాకుండా ఏం జరుగుతోందో తెలుసా? ఈ నిజాలు తెలిస్తే..

చిరునవ్వులు చిందించాల్సిన బాల్యం చీకటి మగ్గాల మధ్య, ప్రమాదకరమైన వీధుల్లో నలిగిపోతోంది. బడికి వెళ్లాల్సిన వయసులో బరువులు మోస్తూ దయనీయ స్థితిలో బతుకుతున్న చిన్నారుల జీవితాల్లో హైదరాబాద్ పోలీసులు వెలుగులు నింపారు. ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా బానిస సంకెళ్లను తెంచి వందలాది మంది అభాగ్యులకు విముక్తి కల్పించారు. జూలై ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర పరిధిలో ఏకంగా 1,413 మంది బాలకార్మికులను పోలీసులు రక్షించారు. వీరిలో 1,331 మంది బాలురు ఉండగా, 82 మంది బాలికలు ఉన్నారు. ఆడుకునే వయసులో కష్టాల కొలిమిలో మగ్గుతున్న ఈ చిన్నారులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సియాసాత్ కథనం ప్రకారం.. రక్షించిన చిన్నారుల వివరాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రక్షించబడిన వారిలో 828 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కాగా, 563 మంది దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఉన్నారు. ఆశ్చర్యకరంగా పొరుగు దేశమైన నేపాల్ నుంచి కూడా 22 మంది పిల్లలు ఇక్కడికి వచ్చి బాలకార్మికులుగా మగ్గుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా బాలకార్మికులుగా పనిచేస్తున్న వారు, వీధుల్లో భిక్షాటన చేస్తున్న వారు, అసురక్షిత వాతావరణంలో దుర్భర జీవితం గడుపుతున్న అనాథ పిల్లలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ సాగింది. బాల్యాన్ని చిదిమేస్తున్న ఇలాంటి పరిస్థితుల నుంచి వారిని కాపాడి పునరావాసం కల్పించే దిశగా పోలీసులు అడుగులు వేశారు.

ఇది కూడా చదవండి: పోటెత్తిన వరద.. సముద్రాన్ని తలపిస్తున్న ప్రాజెక్టులు!

ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేశాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ), జువైనల్ బ్యూరో (జేబీ) యూనిట్, వివిధ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ కొనసాగింది. నగరవ్యాప్తంగా తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేకంగా 26 డివిజనల్ స్థాయి బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందాలు వాణిజ్య సముదాయాలు, ట్రాఫిక్ జంక్షన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, భవన నిర్మాణ ప్రాంతాలతో పాటు రద్దీగా ఉండే పలు సున్నితమైన ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. అడుగడుగునా జల్లెడ పట్టి అభాగ్యులను గుర్తించి రక్షించాయి.

ఇది కూడా చదవండి: సరికొత్తగా ముస్తాబవుతున్న రాజరాజేశ్వర స్వామి ఆలయం.. రాజన్న భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్

చట్టాలను ఉల్లంఘించి చిన్నారులతో పనులు చేయిస్తున్న యజమానులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. చట్టవ్యతిరేకంగా పిల్లలను పనుల్లో పెట్టుకున్న యాజమాన్యాలపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 64 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కనీస వేతన చట్టం కింద ఏకంగా 723 కేసులు నమోదు చేసి, తప్పు చేసిన యజమానులకు 25 లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించారు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ కఠిన చర్యల ద్వారా పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కాకుండా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ ఆపరేషన్ ముస్కాన్ ముమ్మరంగా సాగింది. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 664 మంది బాలకార్మికులకు విముక్తి లభించింది. అలాగే మల్కాజిగిరి పరిధిలో కూడా పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి 648 మంది పిల్లలను రక్షించారు. ఉమ్మడి రాజధాని ప్రాంతంలో మొత్తం వేలాది మంది చిన్నారులకు ఈ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా కొత్త జీవితం లభించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి డ్రైవ్‌లు కొనసాగించి బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే దిశగా అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports