Hyderabad: నమ్మి ఇంట్లో పనికి పెట్టుకుంటే ఎంత పని చేసింది? ఏకంగా యజమాని బిడ్డపై కన్నేసింది.. పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Hyderabad: సంతానం లేదనే బాధతో ఒక మహిళ తాను పనికి కుదిరిన ఇంటోనే ఎనిమిది నెలల పసికందును కిడ్నాప్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అయితే, ఘటన జరిగిన వెంటనే సమర్థవంతంగా స్పందించిన పోలీసులు కేవలం మూడు గంటల వ్యవధిలోనే నిందితురాలిని అదుపులోకి తీసుకుని, పసికందును క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈనాడు కథనం ప్రకారం.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌బీఎన్ కాలనీకి చెందిన కొట్టే శివరామ్, ఆయన భార్యకు ఎనిమిది నెలల కుమారుడు జైష్ణవ్ రుద్రాంక్ష్ ఉన్నాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన సల్ల దుర్గాభవానీ అనే మహిళ నెల రోజుల క్రితం వీరి భవనంలో పనిమనిషిగా, కాపలాదారుగా చేరింది. ఆ భవనంలో ఉన్న మూడు కుటుంబాలకు ఆమె పనులు చేస్తూ నమ్మకంగా ఉండేది.

ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో శివరామ్ భార్య ఇంట్లో వంట పనిలో నిమగ్నమై ఉంది. ఇది గమనించిన దుర్గాభవానీ.. బాబును తాను బయట ఆడిస్తానని చెప్పి పక్కకు తీసుకెళ్లింది. ఇంట్లోవారు వంట పనిలో ఉండగా, ఎవరూ చూడని సమయం చూసి ఆ ఎనిమిది నెలల పసికందును ఆటోలో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారైంది.

మూడు గంటల్లోనే పోలీసుల మెరుపు వ్యూహం

కొద్దిసేపటి తర్వాత బాబు కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు కిందకు వచ్చి చూడగా పనిమనిషి దుర్గాభవానీ కూడా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి వెంటనే మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటన తీవ్రతను అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను (Special Teams) రంగంలోకి దించారు. ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను సమగ్రంగా విశ్లేషించి, నిందితురాలు ప్రయాణించిన ఆటో మార్గాన్ని ట్రాక్ చేశారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు కేవలం 3 గంటల్లోనే ఉప్పల్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో నిందితురాలు దుర్గాభవానీని అదుపులోకి తీసుకున్నారు. బాబును సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు తీవ్ర భావోద్వేగానికి లోనై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు

పోలీసుల విచారణలో నిందితురాలు దుర్గాభవానీ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె కర్మాన్‌ఘాట్ ప్రాంతంలో నివాసముంటోంది. వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో మానసిక వేదనకు గురైందని, శివరామ్ బాబును తానే సొంతంగా పెంచుకోవాలనే దుర్బుద్ధితోనే ఈ కిడ్నాప్‌నకు ఒడిగట్టినా అని విచారణలో ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed