Hyderabad: భార్య పుట్టింటికి వెళ్లిందని.. భర్త అదృశ్యం.. మిస్టరీగా మారిన ఫోన్ కాల్! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

చంద్రప్పకు ఉన్న మద్యపానం అలవాటు కుటుంబంలో చిచ్చు పెట్టింది. చంద్రప్ప మద్యానికి బానిసై, తరచూ మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. చిన్న చిన్న విషయాలకే దంపతుల మధ్య ఘర్షణలు తలెత్తేవి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం సహజం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య పుట్టింటికి వెళ్లిందన్న బాధతో, మనస్తాపానికి గురైన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయి అదృశ్యమైన ఘటన రాజధాని నగరంలో కలకలం రేపుతోంది. దీనికి తోడు ఒక అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది.

ఈనాడు కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా హనుమాన్‌పూర్ గ్రామానికి చెందిన తలారి నర్సమ్మకు, సుమారు 15 ఏళ్ల క్రితం లింగంపల్లి హెచ్‌ఏఎల్ (HAL) ప్రేమ్‌నగర్ నివాసి అయిన చంద్రప్పతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదిహేనేళ్లుగా వీరి సంసారం సాఫీగానే సాగినప్పటికీ, చంద్రప్పకు ఉన్న మద్యపానం అలవాటు కుటుంబంలో చిచ్చు పెట్టింది. చంద్రప్ప మద్యానికి బానిసై, తరచూ మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. చిన్న చిన్న విషయాలకే దంపతుల మధ్య ఘర్షణలు తలెత్తేవి.

భార్య వెళ్ళిపోవడంతో మొదలైన విషాదం

గత ఏప్రిల్ 11న కూడా ఇలాగే గొడవ జరగడంతో, విసిగిపోయిన నర్సమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్ళిపోయినప్పటి నుండి చంద్రప్ప తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమెను తిరిగి రమ్మని కోరినా ఫలితం లేకపోవడంతో, తీవ్ర ఒత్తిడికి లోనైన అతను ఏప్రిల్ 16న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా అతని ఆచూకీ లభించలేదు.

మిస్టరీ కాల్.. రూ. 300ల ట్రాన్సాక్షన్

చంద్రప్ప అదృశ్యమైన అదే రోజు (ఏప్రిల్ 16) మధ్యాహ్నం 2 గంటల సమయంలో నర్సమ్మకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. “మీ భర్త లక్డీకాపూల్‌లోని సువిధ హోటల్ సమీపంలో ఉన్నాడు.. అతను చాలా నీరసంగా ఉన్నాడు, వెంటనే వచ్చి తీసుకువెళ్లండి” అని ఆ వ్యక్తి చెప్పాడు. అంతేకాకుండా, అతన్ని తీసుకురావడానికి ఆటో ఖర్చుల నిమిత్తం రూ. 300లను ఆన్‌లైన్‌లో పంపమని కోరాడు. కంగారుపడిన నర్సమ్మ వెంటనే ఆ వ్యక్తి చెప్పిన నంబర్‌కు డబ్బులు పంపించి, అక్కడికి చేరుకుంది. అయితే, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ చంద్రప్ప లేడు, ఆ ఫోన్ చేసిన వ్యక్తి కూడా కనిపించలేదు. ఆ తర్వాత ఆ ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె మోసపోయానని గ్రహించింది.

పోలీసుల దర్యాప్తు

భర్త ఆచూకీ కోసం అన్ని చోట్లా వెతికి విసిగిపోయిన నర్సమ్మ, చివరకు సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త అదృశ్యం వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్సై నవీన్, చంద్రప్ప మొబైల్ సిగ్నల్స్ మరియు ఆ అపరిచిత వ్యక్తికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మద్యం మత్తులో చేసిన గొడవ ఒక నిండు కుటుంబాన్ని ఇలా రోడ్డున పడేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పోలీసులు చంద్రప్ప కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *