Last Updated:
IND vs SL: క్రికెట్ ఈజ్ ఏ ఫన్నీ గేమ్ అంటారు. అంటే క్షణాల్లో మ్యాచ్ స్వరూపం మారిపోతుంది కాబట్టి. ఇది ఎక్కువగా టి20ల్లో జరుగుతుంది. అయితే తాజాగా టెస్టు మ్యాచ్లో కూడా జరిగింది. అయితే ఇది అధికారిక టెస్టు మ్యాచ్ కాదు.. ప్రాక్టీస్ మ్యాచ్.
అది కూడా జరిగింది కేవలం 3 రోజులే. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు ఆగస్టు 7 నుంచి 9 వరకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. తొలి రెండు రోజుల ఆట చూసిన తర్వాత మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అనుకున్నారు. అయితే మూడో రోజు ఆటలో అద్భుతం చోటు చేసుకుంది. ఆఖరి రోజు భారత్ 207 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్కు దిగింది. ఒక దశలో మ్యాచ్ డ్రా అవుతుంది అనుకున్నారు. అయితే మొహమ్మద్ సిరాజ్ 15 బంతుల్లో 32 నాటౌట్ మ్యాచ్ను టీమిండియా వశం చేశాడు. ఇందులో 4 సిక్సర్లు.. ఒక ఫోర్ ఉండటం విశేషం.














