Indo-Pacific Partners: ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ.. అమెరికా, చైనాకి చెక్! | | ACTPnews

ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ.. అమెరికా, చైనాకి చెక్!


Last Updated:

Indo-Pacific Partners: అమెరికా లాగానే చైనా కూడా శక్తిమంతమైన దేశంగా మారుతోంది. అందువల్ల ఈ రెండు దేశాలూ భారత్‌కి అతి పెద్ద సమస్య కాగలవు. ఇండియా మూడో పెద్ద దేశంగా ఎదగబోతోంది. అయినప్పటికీ వీటికి చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ.. వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ.. అమెరికా, చైనాకి చెక్!
ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ.. అమెరికా, చైనాకి చెక్!

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం వేగంగా పెరుగుతున్న తరుణంలో, అమెరికా విధానాలలో అనిశ్చితి నెలకొన్న కారణంగా.., భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన మూడు దేశాల (ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) పర్యటన అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. క్షిపణులు, యురేనియం పంపిణీ, కీలక ఖనిజాలు (critical minerals), క్రీడా దౌత్యం వంటి కీలక రంగాలలో భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి మోదీ ఈ పర్యటనను వేదికగా మలుచుకున్నారని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ చేసింది.

ఇండోనేషియాతో చరిత్రాత్మక రక్షణ ఒప్పందాలు:

ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా ఇండోనేషియాతో రక్షణ, వ్యూహాత్మక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది సుమారు రూ.5,400 కోట్ల విలువైన బ్రహ్మోస్ (BrahMos) సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం. భారత్ నుంచి ఇప్పటివరకూ ఇదే గరిష్ట రక్షణ ఎగుమతి డీల్. ఫిలిప్పీన్, వియత్నాం తర్వాత భారత్ నుండి ఈ క్షిపణులను కొంటున్న మూడో దేశంగా ఇండోనేషియా నిలిచింది. దీనితో పాటుగా భారతీయ సాంకేతికతతో తయారైన ‘అస్త్ర’ (Astra) ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను కూడా కొనేందుకు ఇండోనేషియా అంగీకరించింది.

ఆస్ట్రేలియాతో యురేనియం, కీలక ఖనిజాల ఒప్పందాలు:

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చలు విశేష ఫలితాలను సాధించాయి. భారతదేశ పౌర అణు ఇంధన కార్యక్రమానికి (Civilian Nuclear Energy) ఆస్ట్రేలియా యురేనియం ఎగుమతి చేయడానికి కీలక ఒప్పందం కుదిరింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే భారత ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం బలమైన పునాది వేస్తుంది అలాగే రెండు దేశాలూ కొత్తగా ‘జాయింట్ డిక్లరేషన్ ఆన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్’ను కూడా ఆమోదించాయి. గ్రీన్ హైడ్రోజన్, కీలక ఖనిజాల సరఫరా కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఆస్ట్రేలియాతో భారత్ బలమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది.

ప్రధాని మోదీ ఇండోనేషియాలో అడుగుపెట్టడానికి ఒకరోజు ముందే పసిఫిక్ మహాసముద్రంలో చైనా.. అణు సామర్థ్యం గల ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి (ICBM)ని జలాంతర్గామి నుంచి ప్రయోగించింది. ఈ చర్య ప్రాంతీయ దేశాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఈ పరిణామాల మధ్య భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలు తమ రక్షణ, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడం చైనా విస్తరణవాదానికి బలమైన కౌంటర్‌ అనుకోవచ్చు. ఈ ప్రాంతంలో భాగస్వామ్యాలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా ‘పరస్పర విశ్వాసం’ (mutual trust) ఆధారంగా నిర్మితమవ్వాలని ప్రధాని మోదీ తన పర్యటనలో స్పష్టం చేశారు.

భవిష్యత్ ప్రగతికి ఊతం:

ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), పునరుత్పాదక ఇంధన రంగాలలో…. నికెల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఇండోనేషియా , అరుదైన ఖనిజాల్ని కలిగివున్న ఆస్ట్రేలియా దేశాలతో కుదిరిన ఒప్పందాలు భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక ప్రగతికి ఊతం ఇవ్వనున్నాయి. అలాగే మౌలిక సదుపాయాల రంగంలో ఇండోనేషియా సుమారు 500 మిలియన్ డాలర్ల (USD 500 million) పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed