Last Updated:
Jaish-e-Mohammed Terrorist Arrested: దేశంలో భారీ వినాశనానికి వ్యూహం రచించిన ఉగ్రవాదుల కుట్రను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దస్తా (ATS) భగ్నం చేసింది.
నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహ్మద్’ (JeM) కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను ఏటీఎస్ బృందం విజయవంతంగా అదుపులోకి తీసుకుంది. జైష్ ఉగ్రవాదుల కదలికలపై అందిన పక్కా నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. ఈ తాజా అరెస్టులతో ఈ నెట్వర్క్కు సంబంధించి పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల సంఖ్య 13కు చేరింది. అంతకుముందు ఏటీఎస్ బృందం 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోగా, వారిని విచారించిన అనంతరం ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ఐదుగురి వివరాలు బయటపడ్డాయి.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. నిందితులందరినీ ఉత్తర గుజరాత్లోని సిద్ధ్పూర్, దాని పరిసర ప్రాంతాల నుండి అరెస్ట్ చేశారు. భారతదేశంలో భారీ స్థాయిలో బాంబు పేలుళ్లు జరపడమే లక్ష్యంగా ఈ ఉగ్రవాద మాడ్యూల్ కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ మొత్తం నెట్వర్క్కు మహ్మద్ అయూబ్, అమీన్ షేరాలు మాస్టర్మైండ్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు పేలుడు పదార్థాలను తయారు చేయడం కోసం గన్ పౌడర్తో పాటు ఇతర రసాయన పదార్థాలను కూడా తెప్పించినట్లు తేలింది. అంతేకాకుండా, గ్రామాలకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాలలో వీరు ఇప్పటికే 7 నుండి 8 సార్లు చిన్న తరహా పేలుళ్లు జరిపి ట్రయల్స్ (పరీక్షలు) కూడా నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉగ్ర కుట్ర వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉందనే కోణంలో ఏటీఎస్ బృందం ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 17, 2026 11:33 AM IST














