టాలీవుడ్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. అలాంటి చిత్రాల్లో ‘జయం’ ఒకటి. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. హీరోగా నితిన్, హీరోయిన్గా సదా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులోని పాటలు, ఎమోషనల్ సన్నివేశాలు, గోపీచంద్ విలన్ పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే చాలామంది ఆసక్తిగా చూస్తుంటారు.













