Karnataka Politics: ప్రెస్ మీట్‌లో బోరున ఏడ్చేసిన కర్ణాటక మంత్రి.. పదవికి రాజీనామా! | | ACTPnews

News18


Last Updated:

మహర్షి వాల్మీకి కార్పొరేషన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక మంత్రి బి. నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. ప్రెస్‌మీట్‌లో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న ఆయన, పార్టీకి చెడ్డపేరు రాకూడదనే స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

News18
News18

కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్లానింగ్, స్టాటిస్టిక్స్ శాఖ మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. విపక్షాలు తనపై చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే తాను స్వచ్ఛందంగా మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కన్నీటితో స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *