Last Updated: Sep 03, 2026, 19:16 IST
మిర్యాలగూడలో జరిగిన బీఆర్ఎస్ రైతు ధర్నా సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల వీడియోలను కేటీఆర్ మైక్ల ముందు, డిజిటల్ స్క్రీన్లపై ప్లే చేసి చూపించారు. అధికారంలోకి వచ్చాక రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 15,000 రైతు భరోసా, కౌలు రైతులకు ఆర్థిక సాయం వంటి హామీలలో కాంగ్రెస్ చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రజల ఎదుట ఎండగట్టారు.













