Last Updated:
షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానున్న మోదీ సెంట్రల్ ఆసియా పర్యటన వివరాలను విదేశాంగ శాఖ వెల్లడించింది.
షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరిగే 26వ ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. కిర్గిజ్ అధ్యక్షుడు సాదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ప్రధాని ఈ పర్యటన ఖరారైంది. ఆగస్టు 31న స్వాగత విందు, మరుసటి రోజు ప్రధాన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్ వెల్లడించారు.














