Last Updated:
PM Modi Message: దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడే, క్షేత్రస్థాయిలో కంటికి కనిపించే ఫలితాలను అందించే విధానాలే ఇప్పుడు దేశానికి శ్రీరామరక్ష అని ప్రధాని వివరించారు.
ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకునే పటిష్టమైన రాజకీయ నిర్ణయాలే నిజమైన జాతీయ అభివృద్ధికి బాటలు వేస్తాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేసే తాత్కాలిక ప్రకటనల వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. ప్రముఖ పత్రిక ‘ది ఎకనామిక్ టైమ్స్’ అధ్వర్యంలో నిర్వహించిన ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ వేదికగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే కీలకమైన విధానాలపై ఆయన తన దృక్పథాన్ని పంచుకున్నారు.














