Rahul Gandhi : శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్ | | ACTPnews

Rahul Gandhi : శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్ |


Last Updated: Mar 30, 2026, 21:28 IST

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (మార్చి 30, 2026) రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి హిందూ మతం అన్నా, ఆలయాల అన్నా నిజమైన గౌరవం లేదని ఆయన విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే శబరిమల ఆలయంలో బంగారం చోరీ జరిగితే, దానిపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేరళలో అధికార ఎల్డీఎఫ్ (LDF) మరియు బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే ఇరు పార్టీలు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. ఓట్ల కోసమే బీజేపీ హిందూ మతాన్ని వాడుకుంటుందని, ఆలయాల రక్షణ విషయంలో వారికి చిత్తశుద్ధి లేదని రాహుల్ ఎండగట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *