Ram Mohan Naidu | ఎయిర్ ఇండియా ఘటనపై రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు | ACTPnews

News18 Telugu



#AirIndia #RamMohanNaidu #FlightIncident #Turbulence #AviationNewsపుకెట్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (AI2379) విమానం గాల్లో తీవ్ర కుదుపులకు లోనై, 300 అడుగుల మేర కిందకు పడిపోయిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. దిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్వయంగా పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 4 నుంచి 5 నిమిషాల పాటు గాల్లో విమానం అలజడికి గురైందని, ఘటన సమయంలో ధైర్యంగా వ్యవహరించిన క్రూ సిబ్బందిని అభినందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)ను ఆదేశించారు. విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports