Last Updated: Sep 12, 2026, 09:52 IST
తెలంగాణ శాసనసభలో రాష్ట్ర విద్యా రంగం మరియు ఉపాధ్యాయ-విద్యార్థుల నిష్పత్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ మరియు రెసిడెన్షియల్ కళాశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల పూర్తి గణాంకాలను సభకు వివరించారు. రైట్ టు ఎడ్యుకేషన్ నిబంధనల కంటే మెరుగ్గా రాష్ట్రంలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని తెలిపారు. 55 రోజుల్లోనే 10,000 పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు.













