Russia Ukraine War: రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ డ్రోన్లు.. 13 మంది మృతి.. 75 మందికి గాయాలు! | | ACTPnews

AI Gen


Last Updated:

ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యాలోని టాటర్స్థాన్ ప్రాంతం దద్దరిల్లింది. నిజ్నేకామ్స్క్ నగరంలో జరిగిన ఈ భారీ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 75 మంది గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య సుదూర దాడులు తీవ్రరూపం దాల్చాయి.

AI Gen
AI Gen

నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అత్యంత భీకరమైన దాడులు తాజాగా చోటుచేసుకున్నాయి. రష్యాలోని సెంట్రల్ టాటర్స్థాన్ ప్రాంతం లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సరిహద్దులకు సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజ్నేకామ్స్క్ నగరంలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ ఈ భారీ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఏకంగా 13 మంది పౌరులు దుర్మరణం చెందగా, మరో 75 మంది తీవ్రంగా గాయపడినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. టాటర్స్థాన్ ప్రాంతం ప్రధానంగా ఇంధన ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. రష్యా చేస్తున్న వరుస దాడులకు ప్రతీకారంగానే ఉక్రెయిన్ ఈ వ్యూహాత్మక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports