Last Updated:
స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన సమయంలో జరిగిన వివాదం మరింత ముదిరింది. జాతీయ గేయాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు తాజాగా పోలీసులకి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గీతాలాపన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా రేగిన రాజకీయ దుమారం సరికొత్త మలుపు తిరిగింది. జాతీయ గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ సోనియా గాంధీపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఆదివారం కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.














