మరో 5 నౌకలు త్వరలోనే రానున్నాయి. వీటిలో అమ్మోనియా, యూరియా ఉన్నాయి. మొత్తం 15-20 నౌకలు భారత పోర్టులైన కృష్ణపట్నం, కాకినాడ, పారాదీప్, ముంద్ర వైపు వస్తున్నాయి. కృష్ణపట్నం, కాకినాడకి వచ్చే నౌకల్లో ఎరువుల్ని ఏపీ, తెలంగాణకు సప్లై చేస్తారు. అందువల్ల ఆ నౌకల కోసం ఇప్పుడు మనం ఎదురుచూసే పరిస్థఇతి ఉంది. తెలంగాణలో పత్తి, మొక్కజొన్న, ఆంధ్రలో వరి, మిర్చి పండించే రైతులకు యూరియా, డీఏపీ అత్యంత కీలకం. గతంలో ఎరువుల కొరత వల్ల ధరలు పెరిగి, రైతులు నష్టపోయారు. ఇప్పుడు వారికి అందుబాటు ధరల్లో ఎరువులు లభించగలవు. (Image- Reuters)













