Last Updated:
Team India: గాయాల బెడదతో సతమతమవుతున్న భారత క్రికెట్ జట్టుకు అతిపెద్ద ఊరట లభించింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు కీలక ఆటగాళ్లు మైదానంలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది.
అఫ్గానిస్థాన్తో త్వరలో జరగనున్న టీ20 సిరీస్కు ఎంపికైన బుమ్రా, తన ఫిట్నెస్ను పూర్తిస్థాయిలో నిరూపించుకునేందుకు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనున్నాడు. బుమ్రాతో పాటు గాయాల బారిన పడి జట్టుకు దూరమైన యువ ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, పేసర్ హర్షిత్ రాణా కూడా ఈ మూల్యాంకన మ్యాచ్లలో బరిలోకి దిగనున్నారు.














