Last Updated:
జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. ‘ఆపరేషన్ అష్దర్’లో భాగంగా పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా టాప్ కమాండర్ యాసిర్ను శనివారం మట్టుబెట్టాయి.
జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో జరుగుతున్న ‘ఆపరేషన్ అష్దర్’లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. యూస్మార్గ్ ప్రాంతంలో శనివారం జరిగిన భీకర ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఒకరు హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాదిని పాక్ జాతీయుడు యాసిర్గా జమ్మూ కశ్మీర్ పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. గత కొంతకాలంగా యాసిర్ కదలికలపై నిఘా ఉంచిన బలగాలు, పక్కా సమాచారంతో అతన్ని చుట్టుముట్టాయి. తప్పించుకునే క్రమంలో యాసిర్ కాల్పులకు తెగబడటంతో సైన్యం దీటుగా బదులిచ్చి అతన్ని మట్టుబెట్టింది.














