ఈ మేరకు రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన అదనపు ఈవో.. కొత్త బస్సుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, డ్రైవర్ల నియామకం, బస్సుల నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సేవలందిస్తున్న 15 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు కొత్తగా రానున్న 25 బస్సులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాల మేరకు మొత్తం 50 బస్సులకు సరిపడే ఛార్జింగ్ మౌలిక వసతులను సిద్ధం చేయాలని సూచించారు.













