Last Updated:
తిరుమల వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కొండ మీద నేటి పరిస్థితి ఇదే!
తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకుని తరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఏడుకొండలపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సామాన్య భక్తులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు క్యూకడుతున్నారు. ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్న తిరుమలగిరులపై నిత్య కల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఎటు చూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది. స్వామివారి కరుణాకటాక్షాలు పొందేందుకు వీఐపీలు సైతం పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు.













