Last Updated:
Tirupati: ఊరు నుంచి తిరిగివస్తున్న కన్నతల్లి కనిపించగానే ఆ పసివాడి మొహం వెలిగిపోయింది. ‘అమ్మా’ అంటూ అమితమైన ఆప్యాయతతో, కేరింతలు కొడుతూ ఆమెను హత్తుకునేందుకు రోడ్డుపైకి పరుగుతీశాడు.
అయితే, క్షణాల వ్యవధిలోనే విధి వంచించింది. తల్లిని చేరుకోవాల్సిన ఆ పసిపాదం రక్తపు మడుగులో శాశ్వతంగా నిలిచిపోయింది. కళ్లెదుటే కన్నకొడుకును వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొట్టి ప్రాణాలు తీయడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించిన తీరు చూపరుల కంటతడి పెట్టించింది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఈ విషాదకర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.














