Today Top News: తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్.. టాప్ 10 న్యూస్ మీకోసం… | | ACTPnews

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు


జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మార్చేద్దాం..

కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ చరిత్రలో సరికొత్త సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. శతాబ్దాల క్రితం అశోక చక్రవర్తి రాజధానుల్లో ఒకటిగా, ‘సువర్ణగిరి’గా వెలుగొందిన ఈ ప్రాంత వైభవాన్ని పునరుద్ధరించేందుకు జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మార్చాలని ఆయన ప్రతిపాదించారు.

సాయికృష్ణది లాకప్‌డెత్‌..

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణది లాకప్‌డెత్‌ అని ప్రాథమిక విచారణలో తేలిందని సిట్‌ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేశారు. కస్టడీలో తగిలిన గాయాల వల్లే అతను మృతి చెందాడని, ఈ క్రమంలో కృష్ణలంక పీఎస్‌కు సంబంధించిన మే 1 నుంచి జూన్‌ 1 వరకు గల సీసీటీవీ ఫుటేజీలను ఉద్దేశపూర్వకంగా డిలీట్‌ చేశారని రిపోర్టులో పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌కు బెయిల్‌

తెలంగాణ భవన్‌ సమావేశంలో సింగరేణి అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టయిన బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది. నాంపల్లి పోలీసుల కేసు నమోదు నేపథ్యంలో ఇద్దరి పూచీకత్తులతో ఆయనకు ఈ బెయిల్‌ లభించింది.

రేవంత్‌‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదు…

సత్తుపల్లి పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, కేవలం ‘రెన్యువల్ సీఎం’ అంటూ సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్‌ ఓటమితో రాష్ట్రం నష్టపోయిందని, కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు వేధింపులకు గురవుతుండటంతో కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

రేపు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు జూన్ 25న (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయని విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

నీట్ పరీక్ష లోపాలను సరిదిద్దాం..

NEET 2026 పరీక్ష నిర్వహణలో కొన్ని లోపాలు చోటుచేసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, లోపాలను సరిదిద్దిన అనంతరం పునఃపరీక్షను విజయవంతంగా నిర్వహించామని బుధవారం వెల్లడించారు.విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు, కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి పారదర్శకంగా ఈ రీ-ఎగ్జామ్ చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.

ఖమేనీ అంత్యక్రియలు.. మోదీకి పిలుపు

అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతిచెందిన ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ ఆహ్వానించినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. జులై 5 నుంచి 9 వరకు ఇరాన్‌లోని వివిధ నగరాల్లో ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమాలు జరగనుండగా, ప్రధాని మోదీ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

హర్మూజ్‌లో ఎటువంటి సుంకాల్లేవ్‌..

హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఎలాంటి రుసుములు వసూలు చేయబోదని హామీ ఇచ్చిందని, ఒకవేళ ఇది తప్పని తేలితే ఆ దేశంతో చర్చలను తక్షణమే నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్‌కు తాము నేరుగా ఎటువంటి నిధులను విడుదల చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.

సమంత సత్తాను తక్కువగా అంచనా వేశారు..

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.50 కోట్లు సాధించి మంచి ఆదరణ పొందుతుండగా, ఆమె సత్తాను పరిశ్రమలో తక్కువగా అంచనా వేశారని ఆమె భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో సినిమా విజయంపై స్పందించిన ఆయన, సమంత ప్రతిభకు ఈ కలెక్షన్లే నిదర్శనమని ఆనందం వ్యక్తం చేశారు.

నా కొడుకు ‘చరణ్ జీవి

రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు సానా స్క్రీన్‌ప్లేతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోన్న ‘పెద్ది’ మూవీ మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తన కుమారుడు రామ్ చరణ్ అద్భుత నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports