Vellampalli : పరకామణి దొంగతనంపై వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు | ACTPnews

Vellampalli  : పరకామణి దొంగతనంపై వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు



తిరుమల పరకామణిలో జరుగుతున్న అక్రమాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వంలో శ్రీవారి ఆలయ పవిత్రత దెబ్బతింటోందని, దొంగలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. రూ. 87 లక్షల దోపిడీ జరిగితే దాన్ని రూ. 6 లక్షలుగా చిత్రీకరించి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ విషయంలో రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు పరకామణిలో జరుగుతున్న వాస్తవ దొంగతనాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports