ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించగా, మిగిలిన 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 17 మంది పర్యాటకులు, నలుగురు బోట్ సిబ్బంది ఉన్నారు. బోటులో ఉన్న మొత్తం 36 మంది వివరాలు లభ్యమయ్యాయని, అయితే ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో మరణించిన 15 మందిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన వారు 10 మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు, కేరళకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. హనోయిలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) మరణించిన 15 మంది వివరాలను అధికారికంగా విడుదల చేసింది.
It is with profound grief that we share the list of 15 Indian nationals who have lost their lives in the tragic boat accident near Phuc Quoc Island today. The list has been recieved from the Vietnamese authorities.
Our prayers are with the families of the deceased.The Embassy… pic.twitter.com/2fr2TjXuPp
— India in Vietnam (@AmbHanoi) July 11, 2026
1. నల్లపేట ఆదిశేషయ్య రవితేజ
2. శ్రీధర్ ముడియం
3. జయలక్ష్మి గెల్లి
1. సెంథిల్ కుమార్ జయవేల్
2. మురుగ ప్రభు ఆరుముగం
3. శ్రీధర్ సుందరరాజన్
4. షేక్ అబ్దుల్లా అబ్దుల్ మజీద్
5. బాలాజీ నటేషన్
6. వినయ్ కుమార్ చిత్తాపురం భాస్కర
7. రవిశంకర్ సుగుమారన్
8. సంతోష్ కుమార్ శాంతిలాల్ జైన్
9. బాబు కుప్పుస్వామి
10. అలగురాజన్ శివసామి
1. అవికోట్ చెరియన్ థామస్
2. లోవేని థామస్
ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం అధికారులు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. మెరైన్ రెస్క్యూ సిబ్బందితో కూడిన అత్యవసర బృందాలు గాలింపు చర్యలు చేపట్టి, ప్రాణాలతో బయటపడిన వారికి తక్షణ వైద్య సహాయాన్ని అందించారు.
ఈ ఉదంతంపై హనోయిలోని భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ.. తాము స్థానిక వియత్నాం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నామని స్పష్టం చేసింది. వియత్నాంలో భారతీయ పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న తరుణంలో (గత 2025లో 7.4 లక్షల మందికి పైగా భారతీయులు వియత్నాంను సందర్శించారు) ఈ ఘోర ప్రమాదం జరగడం భారతీయ కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై వియత్నాం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.













