YS Sharmila Attacks Center: పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ షర్మిల ఫైర్! | ACTPnews

YS Sharmila Attacks Center: పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ షర్మిల ఫైర్!



ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తూ భారీగా చేరుతున్నారని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంధన ధరల పెంపుతో సామాన్యుడి నడుం విరుగుతుంటే.. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి వంతపాడుతున్నాయే తప్ప నిలదీయడం లేదని షర్మిల ధ్వజమెత్తారు. పెంచిన ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed