Last Updated:
దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడిన భారత సైనికుల వీరత్వానికి 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఘన గుర్తింపు లభించింది.
దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడిన భారత సైనికుల పరాక్రమానికి మరోసారి ఘన గుర్తింపు లభించింది. 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన గ్యాలంట్రీ అవార్డుల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆర్మీ సిబ్బందికి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కాయి. వీటిలో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారమైన కీర్తి చక్ర, శౌర్య చక్ర, బార్ టు శౌర్య చక్ర అవార్డులు ఉన్నాయి.














