Last Updated:
నేపాల్లో ఒక్కసారిగా వచ్చిన భారీ వరదలు 8 మంది ప్రాణాలను బలిగొన్నాయి.. 105 మందికి పైగా భారతీయులు గల్లంతైనట్లు సమాచారం! ఎండగా ఉన్న సమయంలోనే వరద ఎలా వచ్చింది? గ్లేసియర్ బరస్ట్ జరిగిందా?
నేపాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా టిబెట్ సరిహద్దుకు సమీపంలోని పర్వత ప్రాంతమైన రసువా జిల్లాలో బుధవారం, ఆగస్టు 26, 2026న సంభవించిన భారీ వరదల కారణంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. రహదారులు, వంతెనలు, విద్యుత్ మౌలిక వసతులు, పవర్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.














