Rakhi: సైనికులకు 4.5 లక్షల రాఖీలు.. గుజరాత్ అంగన్‌వాడీల అపూర్వ కానుక | | ACTPnews

సైనికులకు 4.5 లక్షల రాఖీలు.. (Image - ANI)


Last Updated:

Rakhi: ఈ రాఖీలు కేవలం సాధారణ దారాలు కావు, అవి సైనికుల క్షేమాన్ని, విజయాన్ని కోరుతూ అంగన్‌వాడీ సోదరీమణులు చేసిన హృదయపూర్వక ప్రార్థనలకు, వారి ఆశీస్సులకు నిదర్శనంగా నిలుస్తాయని అధికారులు తెలిపారు.

సైనికులకు 4.5 లక్షల రాఖీలు.. (Image - ANI)
సైనికులకు 4.5 లక్షల రాఖీలు.. (Image – ANI)

రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు, రక్షణకూ, విడదీయరాని బంధానికి ప్రతీక. ఈ పవిత్రమైన పండుగను పురస్కరించుకుని గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు దేశం గర్వించదగిన, అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ సరిహద్దుల్లో రేయింబవళ్లు, ఎండనకా, వాననకా కాపలా కాస్తూ, మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికుల కోసం వారు ఏకంగా 4.50 లక్షలకు పైగా రాఖీలను పంపారు. తమ ప్రాణాలనూ, కుటుంబాలనూ సైతం లెక్కచేయకుండా మాతృభూమి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జవాన్లకు దేశం మొత్తం అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports