రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. ఆరుగురి మృతి.. మాస్కోలో హై అలర్ట్! | | ACTPnews

image credit: grok


Last Updated:

రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ అనూహ్యంగా భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వైల్డ్‌బెర్రీస్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యుద్ధం మొదలైన తర్వాత ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి.

image credit: grok
image credit: grok

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ దళాలు వందలాది డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. 2022లో సైనిక ఘర్షణ మొదలైన తర్వాత రష్యా భూభాగంపై జరిగిన అత్యంత భారీ వైమానిక దాడి ఇదే కావడం గమనార్హం. ఆదివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ల దాడిలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సీఎన్ఎన్ కథనం పేర్కొంది. రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రికి రాత్రే ఉక్రెయిన్‌కు చెందిన 822 డ్రోన్లను రష్యా సైన్యం ధ్వంసం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports