Last Updated:
పశ్చిమాసియాలో ఆరు నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇరాన్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ముప్పును శాశ్వతంగా తొలగించే అవకాశం తమకు చాలా దగ్గరలో ఉందన్నారు.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధం ఆరవ నెలలోకి ప్రవేశించింది. ఈ పోరులో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మళ్లీ దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ పాలన మునుపెన్నడూ లేనంతగా బలహీనపడిందని గురువారం ఆయన పేర్కొన్నారు. సైనికాధికారులతో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు.. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును శాశ్వతంగా తొలగించగలమన్న బలమైన నమ్మకం తనకు ఉందన్నారు.














