Last Updated:
NEET నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకున్న NEET-UG విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లో పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
NEET పరీక్షకు సంబంధించిన అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన ఆందోళనలకు సంబంధించి విద్యార్థి నిరసనకారులపై నమోదైన FIRలను రద్దు చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా తనకు ఉన్న అసాధారణ అధికారాలను వినియోగించి ఈ కేసులను కొట్టివేసింది.














