‘కోర్ట్’ హీరో హర్ష్ రోషన్ కొత్త సినిమా స్టార్ట్.. ఈవీవీ బ్యానర్‌లో ఇంటెన్స్ లవ్ డ్రామా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

'కోర్ట్' హీరో హర్ష్ రోషన్ కొత్త సినిమా స్టార్ట్.. ఈవీవీ బ్యానర్‌లో ఇంటెన్స్ లవ్ డ్రామా..! | తెలుగు సినిమా వార్తలు


ఈ చిత్రంలో యువ నటుడు హర్ష్ రోషన్ హీరోగా, ప్రతిభావంతురాలు ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన కోర్ట్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్.. మరోసారి భావోద్వేగాలకు పెద్దపీట వేసిన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా రూపొందనుంది.

ఈ సినిమాకు అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. మానవ సంబంధాలు, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ కథను అత్యంత సహజత్వంతో తెరపై ఆవిష్కరించేందుకు దర్శక ద్వయం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. వాస్తవ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలను ఆధారంగా తీసుకుని రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు ఎన్నో విజయవంతమైన వినోదాత్మక చిత్రాలను అందించిన ఈవీవీ సినిమా బ్యానర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గతంలో ఈ సంస్థ నిర్మించిన చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, తొట్టి గ్యాంగ్, అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ, ఫిట్టింగ్ మాస్టర్, నువ్వంటే నాకిష్టం, కితకితలు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడంతో పాటు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇప్పుడు అదే బ్యానర్ నుంచి వస్తున్న ఈ కొత్త చిత్రం కూడా భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక కథాంశంతో రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని ఈ.వీ.వీ. సత్యనారాయణ తనయుడు, నటుడు ఆర్యన్ రాజేష్, నిర్మాత ఎన్.వి. కృష్ణారెడ్డితో కలిసి నిర్మిస్తున్నారు. కొత్త తరహా కథలు, నాణ్యమైన నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొని విజయవంతమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, అనంతరం విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం.

అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కూడా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను జిజు సన్నీ నిర్వహిస్తుండగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వినీల్ నల్లమిల్లి వ్యవహరిస్తున్నారు. మార్కెటింగ్ బాధ్యతలను విష్ణు తేజ్ పుట్ట నిర్వహిస్తుండగా, ప్రచార బాధ్యతలను ప్రముఖ పీఆర్వో మడూరి మధు చూసుకుంటున్నారు.

భావోద్వేగాలతో కూడిన ప్రేమకథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని అందిస్తుందని, ఈవీవీ సినిమా బ్యానర్‌కు మరో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు ఇప్పటికే సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

నటీనటులు: హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ తదితరులు.

సాంకేతిక బృందం:

బ్యానర్లు: ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్

నిర్మాతలు: ఎన్.వి. కృష్ణారెడ్డి, ఆర్యన్ రాజేష్

దర్శకులు: అరుణ్ బాలాజీ, శ్రీ రంజని

డీఓపీ: జిజు సన్నీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినీల్ నల్లమిల్లి

మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట

పీఆర్వో: మడూరి మధు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports