Last Updated:
ప్యాకేజ్డ్ ఫుడ్పై అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉంటే హెచ్చరించే లేబుల్స్ ఎందుకు వద్దు? ఈ విషయంలో FSSAI వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై కోర్టు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసింది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్నట్లు వినియోగదారులకు స్పష్టంగా హెచ్చరికలు ఇచ్చే Front-of-Package Labels (FOPL) విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు గతంలో సూచించిన విధానానికి అనుగుణంగా చర్యలు తీసుకోకుండా, FSSAI మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన తీసుకురావడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.














